త్వరలో మెట్రోరైళ్లలో Wedding ఫొటో షూట్‌

ABN , First Publish Date - 2022-05-23T16:35:26+05:30 IST

తమిళనాడు నగరంలోని మెట్రోరైళ్లలో వధూవరుల ఫొటో షూట్‌ నిర్వహించేందుకు మెట్రోరైల్వే సంస్థ సన్నాహాలు చేపడుతోంది. ఇటీవల కేరళలోని కొచ్చిన్‌

త్వరలో మెట్రోరైళ్లలో Wedding ఫొటో షూట్‌

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి) : తమిళనాడు నగరంలోని మెట్రోరైళ్లలో వధూవరుల ఫొటో షూట్‌ నిర్వహించేందుకు మెట్రోరైల్వే సంస్థ సన్నాహాలు చేపడుతోంది. ఇటీవల కేరళలోని కొచ్చిన్‌ నగరంలో నడుపుతున్న మెట్రోరైళ్లలో కొన్ని నిబంధనల మధ్య నవ దంపతుల ఫొటో షూట్‌ను నిర్వహించేందుకు అనుమతించారు. నిలిచి వున్న ఓ మెట్రోరైలు బోగీలో రెండు గంటలపాటు వధూవరుల ఫొటో షూట్‌ జరుపుకొనేందుకు రూ.5వేలను ఛార్జీగా వసూలు చేస్తున్నారు. అదే విధంగా కదులుతున్న రైలులోని ఓ బోగీలో ఫొటో షూట్‌ జరుపుకోవడానికి రూ.8వేలను ఛార్జీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొచ్చిన్‌లో ఈ ఫొటో షూట్‌  ద్వారా అక్కడి మెట్రోరైల్వే సంస్థకు ఆదాయం కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో నగరంలోనూ అదే రీతిలో మెట్రోరైళ్లలో  వెడ్డింగ్‌ ఫొటో షూట్‌లు నిర్వహించాలని మెట్రోరైల్వే సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై మెట్రోరైల్వే సంస్థ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ నగరంలోని మెట్రోరైళ్లలో సెలవుదినాల్లో, రాత్రివేళల్లో సినిమా షూటింగ్‌లు, యాడ్‌ ఫిల్ముల షూటింగ్‌లు జరుపుకొనేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఈ రైళ్లలో రోజూ 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఈ పరిస్థితులలో అనువైన సమయాలలో కేరళ తరహాలో వధూవరుల ఫొటో షూట్‌ నిర్వహించేందుకు అనుమతించే అవకాశం ఉందని, అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

Updated Date - 2022-05-23T16:35:26+05:30 IST