అర్థరాత్రి వేళ పోలీసులకు ఫోన్.. ఆ ఇంటిలో నలుగురు కుటుంబ సభ్యులు హతమయ్యారంటూ సమాచారం.. ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-25T17:52:19+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి..

అర్థరాత్రి వేళ పోలీసులకు ఫోన్.. ఆ ఇంటిలో నలుగురు కుటుంబ సభ్యులు హతమయ్యారంటూ సమాచారం.. ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను దారుణంగా హతమార్చారు. మృతులలో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఫఫామవు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ గంజ్ ఫుల్వరియా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి ఫఫామవూ పోలీసులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఫూల్ చంద్(50) కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో అతనితో పాటు అతని భార్య దేవి(45), కుమార్తె సప్నా(17) కుమారుడు శివ(10) నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక నలుగురు దుండగులు వారి ఇంటిలోకి చొరబడి మారణాయుధాలతో వారిని హతమార్చారన్నారు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతదేహాలకు పంచనామా, పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు.



Updated Date - 2021-11-25T17:52:19+05:30 IST