Travel ban: భారత్ సహా 7దేశాలపై నిషేధాన్ని పొడిగించిన ఫిలిప్పీన్స్

ABN , First Publish Date - 2021-07-15T22:19:02+05:30 IST

మహమ్మారి కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ను పొడిగిస్తున్నట్లు బుధవారం ఫిలిప్పీన్స్ సర్కార్ వెల్లడించింది.

Travel ban: భారత్ సహా 7దేశాలపై నిషేధాన్ని పొడిగించిన ఫిలిప్పీన్స్

మనీలా: మహమ్మారి కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ను పొడిగిస్తున్నట్లు బుధవారం ఫిలిప్పీన్స్ సర్కార్ వెల్లడించింది. ఫిలిప్పీన్స్ మొదట ఈ నెల 15 వరకు భారత్‌తో పాటు యూఏఈ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఒమన్‌పై ప్రయాణ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆంక్షలను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్-ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో ఈ ఏడు దేశాల ప్రయాణికులకు సంబంధించి టెస్టింగ్, క్వారంటైన్ విధానాలను త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి హ్యారీ రోక్ వెల్లడించారు. 

Updated Date - 2021-07-15T22:19:02+05:30 IST