అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ నిబంధన.. ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-13T14:42:14+05:30 IST

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ నిబంధన.. ఎప్పటినుంచి అంటే..

స్పష్టత ఇచ్చిన యూజీసీ.. రాష్ట్రంలో లక్ష మందికి ప్రయోజనం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పీహెచ్‌డీ పట్టా ఉండాలనే నిబంధనను ప్రస్తుతానికి మినహాయిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రకటించింది. ఈ నిబంధనను 2023 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. యూజీసీ నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలో సుమారు లక్ష మంది అభ్యర్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే నిర్ణయించింది. కానీ ఇంకా భర్తీ చేయలేదు. యూజీసీ తాజా నిర్ణయం ద్వారా అభ్యర్థులకు మేలు జరగాలంటే ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాల్సి ఉంటుంది.  

Updated Date - 2021-10-13T14:42:14+05:30 IST