దివ్యాంగుడి వినతిపై తక్షణం స్పందించిన సీఎం

ABN , First Publish Date - 2022-05-15T18:17:35+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మల్లేశ్వరంలోని బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన సమయంలో అక్కడే వేచి ఉన్న శివప్ప అనే 25 ఏళ్ల దివ్యాంగుడిపై

దివ్యాంగుడి వినతిపై తక్షణం స్పందించిన సీఎం

బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మల్లేశ్వరంలోని బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన సమయంలో అక్కడే వేచి ఉన్న శివప్ప అనే 25 ఏళ్ల దివ్యాంగుడిపై దృష్టి పడింది. దగ్గరగా వెళ్లి దివ్యాంగుడు శివప్పను పలకరించగా అతడు తన సమస్యను ఏకరువు పెట్టాడు. తనది కొప్పళ జిల్లా కనకగిరి నియోజకవర్గంలోని అడవిబావి గ్రామమని చెప్పాడు. తన మూడు చక్రాల కుర్చీ ప్రమాదానికి లోనై నుజ్జునుజ్జయిందని, తనకు కొత్త సైకిల్‌ ఇప్పించమని వేడుకున్నాడు. దీనిపై తక్షణం స్పందించిన సీఎం వెం టనే కొప్పళ జిల్లా అధికారికి ఫోన్‌ చేశారు. వారంలోగా శివప్పకు మూడు చక్రాల సైకిల్‌ అందేలా చూడాలని సూచించారు. సీఎం స్పందించి క్షణాల్లో తన సమస్యను తీర్చడంతో దివ్యాంగుడి సంతోషానికి అవధులు లేవు. 

Updated Date - 2022-05-15T18:17:35+05:30 IST