నేటి నుంచి 2వ దశ నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర: వీజేఎస్, వైజేఎస్
ABN , First Publish Date - 2020-09-22T08:32:52+05:30 IST
నేటి నుంచి 2వ దశ నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర: వీజేఎస్, వైజేఎస్
హైదరాబాద్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తాము చేపట్టిన నిరుద్యోగ బతుకుదెరువు సాధన యాత్ర రెండో దశను మంగళవారం నుంచి ప్రారంభించాలని తెలంగాణ జన సమితి అనుబంధ విద్యార్థి జన సమితి(వీజేఎస్), యువ జన సమితి(వైజేఎస్) రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఈ యాత్ర నిర్వహిస్తారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ నెల 26న నాంపల్లిలోని తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగుల నిరసన దీక్ష చేపడతారన్నారు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకు నిరుద్యోగ సమస్యపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.