పీజీ కౌన్సిలింగ్‌ గందరగోళం

ABN , First Publish Date - 2021-02-24T05:55:19+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది.

పీజీ కౌన్సిలింగ్‌ గందరగోళం
పీసీ సెట్‌ కౌన్సిలింగ్‌లో విద్యార్థుల నిరసన

  1. ప్రొవిజన్‌ సర్టిఫికెట్ల పరిశీలన తీరుపై అభ్యంతరం
  2. వెరిఫికేషన్‌ అధికారిని తొలగించాని డిమాండ్‌

    కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 23: రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. మంగళవారం ఉదయం సెంట్రల్‌ లైబ్రరీలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాణి ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అధికారి ప్రొఫెసర్‌ విశ్వనాథరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాచి. ఏ యూనివర్సిటీలో లేని నిబంధనలకు తెరపైకి తెచ్చారని ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ యూనివర్సిటీ కార్యదర్శి మోహన్‌, వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం కన్వీనరు దిలీప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొవిజన్‌ సర్టిఫికెట్‌తో పాటు మార్కుల లిస్టు కూడా కావాలని అధికారి కోరడంతో కౌన్సిలింగ్‌కు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు వారికి మద్దతుగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు కనీస సౌకార్యలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. లేని పోని నిబంధనలు పెట్టి విద్యార్థులను వెనక్కి పంపడం దారుణమన్నారు. ప్రొఫెసర్‌ విశ్వనాథరెడ్డిని వెరిఫికేషన్‌ అధికారిగా తొలగించాలని ధర్నా నిర్వహించారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులకు సర్దిచెప్పారు.

    136 మంది విద్యార్థుల హాజరు
    కౌన్సిలింగ్‌కు 136 మంది విద్యార్థులు హాజరయ్యారని పీజీ సెట్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ రాణి తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్‌ 51, ఎంఏ హిస్టరీ 16, పోలిటికల్‌ సైన్సు 22, ఎడ్యుకేషన్‌ ఎంఈడీ 11, పిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంపీఈడీ) 36 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.

     

Updated Date - 2021-02-24T05:55:19+05:30 IST