PG సీట్ల భర్తీకి కౌన్సెలింగ్.. ఎప్పటినుంచి అంటే..
ABN , First Publish Date - 2021-11-08T13:29:21+05:30 IST
పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): పోస్టు గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఆదివారం ఆ సీట్ల భర్తీ కన్వీనర్ పాండు రంగారెడ్డి విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది. తొలి దశ సీట్ల కేటాయింపును ఈ నెల 23న ప్రకటించనున్నారు. అలాగే, సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 30 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం డిసెంబరు 2 నుంచి రెండవ దశ కౌన్సెలింగ్కు సంబంధించిన రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా, పీజీ సీట్ల భర్తీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల రిజిస్ర్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 2 నుంచి అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగనుంది.