పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు.. ఎవరికంటే..?
ABN , First Publish Date - 2021-12-29T21:36:25+05:30 IST
రోజురోజుకూ పెట్రోల్ ధరల భారం సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో జార్ఖాండ్..
రాంచీ: రోజురోజుకూ పెట్రోల్ ధరల భారం సామాన్యుడి నడ్డి విరుస్తున్న నేపథ్యంలో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చల్లటి కబురు చెప్పారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గించనున్నట్టు ప్రకటించారు. అయితే, ద్విచక్ర వాహనాల వారికే ఈ సౌకర్యం వర్తించనుంది. హేమంత్ సోరెన్ ఓ ట్వీట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.
''పెట్రోల్, డీజిల్ ధరలు అనునిత్యం పెరిగిపోతున్నాయి. పేదలు, మధ్యతరగతి వర్గంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులందరికీ ఉపశమనం కల్గించేందుకు లీటర్ రూ.25 చొప్పున పెట్రోల్ ధరలు తగ్గించాలని నిర్ణయించాం. 2022 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది'' అని హేమంత్ సోరెన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.