ధర్మపురి: దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో మంత్రి ఆధ్యర్యంలో ధర్నా, ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎడ్లబండ్లతో నిరసన, రాస్తారోకో నిర్వహించారు. వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి