నేటినుంచి యానాంలో పెట్రోల్‌ ధరల పెంపు

ABN , First Publish Date - 2020-05-29T11:48:10+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైనా పుదుచ్చేరిలో పెట్రోల్‌, డీజీల్‌ రెట్లును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నేటినుంచి యానాంలో పెట్రోల్‌ ధరల పెంపు

పెట్రోల్‌పై రూ.2, డీజీల్‌పై రూ.1.30 పెంపు 

మూడు నెలల పాటు వ్యాట్‌ అమలు


యానాం, మే 28: కేంద్రపాలిత ప్రాంతమైనా పుదుచ్చేరిలో పెట్రోల్‌, డీజీల్‌ రెట్లును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వ్యాట్‌ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, యానాం అంటే పెట్రోల్‌, డీజీల్‌, మద్యంకు పెట్టిం ది పేరు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే యానాంలో వీటి ధరలలో చాలా తేడాఉంటుంది. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి యానాంకు అధిక సంఖ్యలో వస్తున్నారు.  ఇప్పుడు డీజీల్‌పై 20శాతం, పెట్రోల్‌పై 25.70శాతం పెంచారు. ప్రస్తుతం పెట్రోల్‌ లీటరు 69.56, డీజీల్‌ 65.15 ఉంది.  పెట్రోల్‌ లీటర్‌కు.2 డీజీల్‌పై 1.30పైసలు పెంచిన ధరలు గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. 


Updated Date - 2020-05-29T11:48:10+05:30 IST