వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రో ధరలు
ABN , First Publish Date - 2021-05-06T12:48:41+05:30 IST
దేశంలో ఎన్నికల పర్వం ముగియగానే కేంద్రం వరుసగా మూడోరోజు పెట్రో ధరలపై అదనపు భారం వేసింది...
న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల పర్వం ముగియగానే కేంద్రం వరుసగా మూడోరోజు పెట్రో ధరలపై అదనపు భారం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం నాడు పెట్రోల్ లీటరు ధరపై 25 పైసలు, డీజిల్ ధరపై 30 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం లీటరు పెట్రోలు ధర 23 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర 94.57 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు గురువారం నాడు 31 పైసలు పెరగ్గా, 88.77 రూపాయలకు ఎగబాకింది. మూడు రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుదలతో వాహనచోదకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు ధరలు పెరగడంతో మూడో రోజు కూడా పెట్రో ధరలు పెంచామని చమురు సంస్థలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల దేశంలో పెట్రో విక్రయాలు 7 శాతం తగ్గాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా నగరాల్లోనూ చమురు ధరలు మూడోరోజు పెరిగాయి.