రక్షాబంధన్ వేళ... తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

ABN , First Publish Date - 2021-08-22T13:36:13+05:30 IST

ఈరోజు రక్షాబంధన్. ప్రభుత్వ చమురు సంస్థలు

రక్షాబంధన్ వేళ... తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: ఈరోజు రక్షాబంధన్. ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 20 పైసల మేరకు తగ్గింది. అదేవిధంగా డీజిల్ కూడా 20 పైసల మేరకు తగ్గింది. ఈ తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.64గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.89.07గా ఉంది. 


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను ప్రకటిస్తుంటుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

ముంబై- పెట్రోల్ రూ. 107.66, డీజిల్ రూ .96.64

చెన్నై- పెట్రోల్ రూ .99.32, డీజిల్ రూ. 93.66

కోల్‌కతా- పెట్రోల్ రూ. 101.93, డీజిల్ రూ. 92.13

జైపూర్- పెట్రోల్ రూ. 108.56, డీజిల్ లీటరుకు రూ. 98.22

భోపాల్- పెట్రోల్ రూ .110.06, డీజిల్ రూ. 97.88

Updated Date - 2021-08-22T13:36:13+05:30 IST