పెట్రోల్ తగ్గింపు డ్రామా యూపీ ఎన్నికల కోసమే: లాలూ

ABN , First Publish Date - 2021-11-04T20:01:56+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్..

పెట్రోల్ తగ్గింపు డ్రామా యూపీ ఎన్నికల కోసమే: లాలూ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెదవి విరిచారు. ప్రజలకు ఇందువల్ల ఎలాంటి నిజమైన ఉపశమనం కలగదని అన్నారు. ఇదంతా డ్రామా అని పేర్కొన్నారు. ఇప్పుడు తగ్గించినట్టు చెప్పినా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పెంచేస్తారని అన్నారు.


మోదీ ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూట్ సరిపోదని వ్యాఖ్యానించారు. ఆరోగ్యపరమైన రొటీన్ చెకప్‌లు, పరీక్షల కోసం బుధవారంనాడు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లీటర్ ధర రూ.50 తగ్గిస్తే అది ఉపశమన చర్యగా ఉంటుందని సూచించారు. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారంనాడు ప్రకటించింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో అసోం, త్రిపుర, కర్మాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలు సైతం ఇంధనం ధరలపై వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.

Updated Date - 2021-11-04T20:01:56+05:30 IST