పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు
ABN , First Publish Date - 2021-01-24T08:06:14+05:30 IST
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు సరికొత్త ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని అధిగమిస్తూనే ఉన్నాయి. ఫలితంగా వాహనదారులపై క్రమంగా ఆర్థిక భారం పెరుగుతోంది...
న్యూఢిల్లీ, జనవరి 23: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు సరికొత్త ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని అధిగమిస్తూనే ఉన్నాయి. ఫలితంగా వాహనదారులపై క్రమంగా ఆర్థిక భారం పెరుగుతోంది. తాజాగా శనివారం కూడా పెట్రోల్, డీజిల్పై 25 పైసలు పెంచాయి ప్రభుత్వరంగ చమురు విక్రయ కంపెనీలు. దీంతో ఈ వారంలో నాలుగుసార్లు (రూ.1 పెంపు) ధరలు పెరిగినట్టయింది.
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.89.15కు, డీజిల్ ధర రూ.82.80కి చేరుకుంది. ఇక ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.85.70కి, డీజిల్ ధర రూ.75.88కి, ముంబైలో పెట్రోల్ రూ.92.28కి, డీజిల్ రూ.82.66కి ఎగబాకింది. స్థానిక పన్ను లేదా వ్యాట్ను బట్టి వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. ప్రస్తుతం దేశంలో ఇంధనాల ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో పెరుగుదల దేశీయ మార్కెట్లో ధరలు పెరిగేందుకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.