పెట్రో ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2021-03-06T05:43:02+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఇచ్ఛాపురం బోర్డర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
ఇచ్ఛాపురం: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఇచ్ఛాపురం బోర్డర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పురుషోత్తపురం జాతీయ రహదారి పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గంటపాటు రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షు డు ముడియా జానికిరామిరెడ్డి, యు.శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.