భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు ?

ABN , First Publish Date - 2021-05-06T20:38:53+05:30 IST

పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ. 5 పెరగనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే

భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు ?

న్యూఢిల్లీ : పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ. 5 పెరగనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెట్రోల్ ధర లీటరుకు ప్రస్తుతం రూ. 100 కు సమీపంలో ఉంది. ఇక డీజిల్ ధర అయితే రూ. 90 దగ్గర కదలాడుతోంది. వాస్తవానికి ఇవే గరిష్ట ధరలనుకుంటే... ఇప్పుడు ధరలు మరింత పెరగనున్నాయనే వినవస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవడానికి మార్జిన్లను పెంచుకోనున్నట్లు  క్రెడిట్ సూసీ పేర్కొంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.50, డీజిల్ ధర లీటరుకు రూ. 3 చొప్పున పెరగనున్నట్లు వినవస్తోంది. 


వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలుగా పెద్దగా పెరగలేదు. అయితే... గత మూడు రోజులుగా మాత్రం పెరుగుతూనే వస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన నేపధ్యంలో ఆయిల్ కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే... మూడు రోజులుగా ధరలు పెరుగుతూన్నాయని చెబుతున్నారు.

Updated Date - 2021-05-06T20:38:53+05:30 IST