పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి
ABN , First Publish Date - 2021-02-27T05:36:11+05:30 IST
పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి
వడ్డెపల్లి, ఫిబ్రవరి 26: పెంచిన డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి డిమాండ్ చేశారు. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళాయాదవ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి కట్టెలపొయ్యి వెలిగించి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా నేతలు రహత్ పర్వీన్, నసీంజహాన్, గాండ్ల స్రవంతి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బంక సంపత్యాదవ్, ఆయూబ్, నల్ల సత్యనారాయణ, బంక సతీ్షయాదవ్ పాల్గొన్నారు.