ఒకే సమస్యపై అర్జీలు పునరావృతం కాకూడదు

ABN , First Publish Date - 2022-05-24T05:20:02+05:30 IST

స్పందన కార్యక్రమంలో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకూడదని, ఇందుకు అనుగుణంగా ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కారం అయ్యేలా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు.

ఒకే సమస్యపై అర్జీలు పునరావృతం కాకూడదు
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

స్పందన సమస్యలపై అదికారులకు కలెక్టర్‌ సూచన

విశాఖపట్నం, మే 23: స్పందన కార్యక్రమంలో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకూడదని, ఇందుకు అనుగుణంగా ఎప్పటి అర్జీలు అప్పుడే పరిష్కారం అయ్యేలా వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో ఆయన అర్జీలు స్వీకరించారు. మొత్తం 185 అర్జీలు అందినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా పాత ఫిర్యాదులపై ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:20:02+05:30 IST