జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-03-17T00:33:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో

జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈ పిటీషన్‌ను ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దాఖలు చేశారు. 250 గజాల పై ఉన్న భూములను రెగ్యులరైజ్ చేసుకునేలా ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. జీవో నెంబర్ 59 ద్వారా 250 గజాలపై ఉన్న అక్రమ భూములను రెగ్యులరైజ్ చేసుకుందుకు  ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే చీఫ్ సెక్రెటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-17T00:33:00+05:30 IST