ఒంగోలులో వైఎస్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2021-08-12T22:04:27+05:30 IST
ఒంగోలులో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అమరావతి: ఒంగోలులో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని, విగ్రహం ఏర్పాటు చేయద్దంటూ స్టే హైకోర్టు ఇచ్చింది. పిటిషనర్ తరుపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.