చానళ్ల నియంత్రణకు స్వతంత్ర సంస్థ!

ABN , First Publish Date - 2020-08-08T07:45:14+05:30 IST

టీవీ చానళ్ల వార్తా ప్రసారాలను నియంత్రించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది...

చానళ్ల నియంత్రణకు స్వతంత్ర సంస్థ!

న్యూఢిల్లీ, ఆగస్టు 7: టీవీ చానళ్ల వార్తా ప్రసారాలను నియంత్రించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సమాచార, ప్రసార శాఖ, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలకు ధర్మాసనం నోటీసులిచ్చి సమాధానం కోరింది. న్యాయవాది రీపక్‌ కంసల్‌ దాఖలు చేసిన ఈ పిల్‌పై సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ నోటీసులిచ్చింది.  

Updated Date - 2020-08-08T07:45:14+05:30 IST