పీజీ మెడికల్ కౌన్సిలింగ్ జీవో 43పై పిటిషన్
ABN , First Publish Date - 2020-05-29T20:06:11+05:30 IST
కౌన్సెలింగ్లో రిజర్వేషన్ సీట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పీజీ మెడికల్ కౌన్సెలింగ్కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో.43ను సవాల్ చేస్తూ డాక్టర్ అలావెంకటేశం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అమరావతి: కౌన్సెలింగ్లో రిజర్వేషన్ సీట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పీజీ మెడికల్ కౌన్సెలింగ్కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో.43ను సవాల్ చేస్తూ డాక్టర్ అలావెంకటేశం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణలో కౌన్సిలింగ్ లో రిజర్వేషన్సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ పాటించడం లేదని పిటీషన్ త రపు న్యాయవాది ధార్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిలింగ్ పై నూతన జీవో విడుదల చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది వెల్లడించారు. పిటీషనర్ కోరిన విధగా సవరణలు చేశామని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూన్ 15కు ధర్మాసనం వాయిదా వేసింది.