తెలుగు అకాడమీ నుంచి పేటశ్రీ రిలీవ్
ABN , First Publish Date - 2020-06-02T09:42:13+05:30 IST
తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి ఆ పదవి నుంచీ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్ 1: తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి ఆ పదవి నుంచీ రిలీవయ్యారు.తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న పేటశ్రీని డిప్యుటేషన్పై గత ఏడాది డిసెంబరు 19 వ తేదీ తెలుగు అకాడమీ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది మే 17 వ తేదీన తనను రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని పేటశ్రీ కోరారు. దీంతో తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచీ రిలీవ్ చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర సోమవారం ఉత్తర్వులను వెలువరించారు. ఈ క్రమంలో తిరిగి ఎస్వీయూ తెలుగు విభాగ ప్రొఫెసర్గా శ్రీనివాసులు రెడ్డి విధుల్లో చేరనున్నారు.