ముంపు ప్రాంతాల్లో అజీజ్‌ పరిశీలన

ABN , First Publish Date - 2020-11-29T05:47:02+05:30 IST

టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం నెల్లూరు 35వ డివిజన్‌లో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్లో అజీజ్‌ పరిశీలన
ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న అజీజ్‌

నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 28:   టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం నెల్లూరు 35వ డివిజన్‌లో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ వారికి అందుతున్న సేవలపై ఆరాతీశారు. తహసీల్దారుతో మాట్లాడి వారికి అవసరమైనవి అందించారు. వీలైతే వేడినీరు అందించాలని తహసీల్దారుకు సూచించారు. అక్కడ ఎక్కువ మంది బాలింతలు ఉండడంతో వారికి పాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌, గున్నయ్య, శాంతినాయుడు, సోని, గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:47:02+05:30 IST