గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-17T17:34:02+05:30 IST

జాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేపీహెచ్‌బీ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షబ్బీర్, మొహమ్మద్ ఆదిల్, షేక్ షరీఫ్ అనే ముగ్గురు వ్యక్తులు వైజాగ్ నుంచి

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేపీహెచ్‌బీ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షబ్బీర్, మొహమ్మద్ ఆదిల్, షేక్ షరీఫ్ అనే ముగ్గురు వ్యక్తులు వైజాగ్ నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించేందుకు యత్నస్తున్నారు. పక్కా సమాచారంతో సర్దార్ పటేల్ నగర్‌లో గంజాయి సంచులతో ఉన్న ముగ్గురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 11 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 4,500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-09-17T17:34:02+05:30 IST