కరోనా భయంతో ఇంటి నుంచి పరారు..

ABN , First Publish Date - 2020-07-10T20:24:56+05:30 IST

విజయవాడ: బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కరోనా భయంతో ఇంటి నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం క్రితం పారిపోయాడు.

కరోనా భయంతో ఇంటి నుంచి పరారు..

విజయవాడ: బెజవాడ పటమట పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కరోనా భయంతో ఇంటి నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి వారం క్రితం పారిపోయాడు. వారం క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయించుకున్న శ్రీనివాసరావు.. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. కాగా.. శ్రీనివాసరావుకు టెస్టుల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-07-10T20:24:56+05:30 IST