క్వారెంటైన్‌ నుంచి వ్యక్తి పరారీ

ABN , First Publish Date - 2020-07-16T13:48:52+05:30 IST

గురజాల లక్ష్మీటాకీస్‌ సెంటరులో పాజిటివ్‌ వచ్చిన యువకుడ్ని ..

క్వారెంటైన్‌ నుంచి వ్యక్తి పరారీ

గుంటూరు(ఆంధ్రజ్యోతి): గురజాల లక్ష్మీటాకీస్‌ సెంటరులో పాజిటివ్‌ వచ్చిన యువకుడ్ని  ఐదు రోజుల క్రితం చిలకలూరిపేట క్వారెంటైన్‌కు తరలించారు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని బుధవారం గురజాలకు వచ్చాడు. వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. దీంతో అధికారులు అతడ్ని ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. అయినా వినకుండానే సంచరిస్తున్నాడు. దీంతో స్థానికుల ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాదు అతడ్ని క్వారెంటైన్‌కు తరలించారు.  

Updated Date - 2020-07-16T13:48:52+05:30 IST