చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-18T06:01:06+05:30 IST

ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో మనస్తాపం చెందిన ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుక్కడం గ్రామంలో బుధవారం జరిగింది.

చికిత్స పొందుతూ వ్యక్తి  మృతి
శ్రీనివాస్‌(ఫైల్‌ ఫొటో)

మద్దిరాల, ఆగస్టు 17: ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో మనస్తాపం చెందిన  ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుక్కడం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్‌(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో సరిగా నడవక పోవడంతో పాటు, కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 15న వ్యవ సాయ భూమిలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్‌ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య విజిత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింగ్‌వెంకన్న తెలిపారు. శ్రీనివాస్‌ కుటుంబాన్ని బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, భూతం సాగర్‌, జలగం అచ్చయ్య, వడ్డాణం కిరణ్‌, యాట మహేష్‌, విక్రమచారిలు పరామర్శించి, శ్రీనివాస్‌ మృతదేహానికి నివాళులర్పించారు.



Updated Date - 2022-08-18T06:01:06+05:30 IST