చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-03T06:00:56+05:30 IST

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మొయినాబాద్‌, జూలై 2: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. తోలుకట్ట గ్రామానికి చెందిన ఎ.సత్తయ్య(35) కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. గతనెల 30న సాయంత్రం 6గంటలకు అదే గ్రామానికి చెందిన చాకలి రవీందర్‌ బైక్‌పై సత్తయ్య టీవీ పట్టుకొని వెనకాల కూర్చున్నాడు. మొయినాబాద్‌ నుంచి తోలుకట్టకు వెళ్తుండగా తోలుకట్ట స్టేజీ దాటిన తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద స్పీడ్‌బ్రేకర్‌ ఉండగా బైక్‌ అదుపుతప్పి సత్తయ్య కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సత్తయ్య తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడి తమ్ముడు పాండు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-07-03T06:00:56+05:30 IST