పంక్చర్ షాపులో కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-08-15T21:09:03+05:30 IST

అనంతపురం: రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంక్చర్ షాపులో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలి

పంక్చర్ షాపులో కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

అనంతపురం: రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంక్చర్ షాపులో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలి శంకరప్ప(57) అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం ఉదయమే పంచర్ షాపుకు వెళ్లిన శంకరప్ప కంప్రెషర్ స్విచ్ ఆన్ చేసి షాపు శుభ్రం చేసుకుంటుండగా ప్రెజర్ ఎక్కువై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దీంతో శంకరప్ప కాళ్లకు శరీర భాగాలకు తీవ్రగాయాలు అయ్యాయి. రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Updated Date - 2020-08-15T21:09:03+05:30 IST