జీవాలను మేపుకునేందుకు వెళ్లి మృత్యువాత

ABN , First Publish Date - 2020-12-06T05:09:50+05:30 IST

మండల పరిధిలోని పొడదుర్తి సమీపంలో జీవాల ను మేపుకునేందుకు వెళ్లి విద్యుత్తు షాక్‌ కు గురై ఓబులేసు (40) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

జీవాలను మేపుకునేందుకు వెళ్లి మృత్యువాత

కమలాపురం, డిసెంబరు 5: మండల పరిధిలోని పొడదుర్తి సమీపంలో జీవాల ను మేపుకునేందుకు వెళ్లి విద్యుత్తు షాక్‌ కు గురై ఓబులేసు (40) అనే వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పోలీసుల కథనం మేర కు... ఖాజీపేట మండలం తిప్పాయపల్లెకు చెందిన ఓబులేసు జీవాలను మేపుకునేందుకు పొడదుర్తి గ్రామాలవైపు వె ళ్లాడు. అక్కడ జీవాల మేతకోసం సుంకేసులచెట్టు ఎక్కి ఆకు విరుస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-06T05:09:50+05:30 IST