ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు పేర్నినాని కౌంటర్

ABN , First Publish Date - 2021-11-12T22:21:38+05:30 IST

తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు పేర్నినాని కౌంటర్

అమరావతి: తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధుల కోసమే బిచ్చమెత్తుకుంటున్నామని తెలిపారు. మాటిమాటికి ఢిల్లీకెళ్తున్న సీఎం కేసీఆర్‌..ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. బయట కాలర్‌ ఎగరేసి..లోపల కాళ్లుపట్టుకునే అలవాటు జగన్‌కు లేదన్నారు. స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ జగన్‌ నైజమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులున్నాయంటున్నారని, కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన.. హైదరాబాద్‌ సొమ్మును అనుభవిస్తున్నారని పేర్నినాని దుయ్యబట్టారు.

Updated Date - 2021-11-12T22:21:38+05:30 IST