6 నుంచి 9 వరకు అనుమతి
ABN , First Publish Date - 2020-04-04T11:39:51+05:30 IST
నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చామని డీఐజీ
రాజోలు, ఏప్రిల్ 3: నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చామని డీఐజీ మోహన్రావు తెలిపారు. శుక్రవారం ఆయన రాజోలు, తాటిపాక సెంటర్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ, ఆక్వా, పాల ఉత్ప త్తులపై ఆంక్షలు సడలించామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప రోడ్లుపైకి రావ ద్దని సూచించారు. తాటిపాక సెంటర్లో మాస్కులు లేకుండా రోడ్డుపై తిరుగు తున్న వాహనదారులను ఆయన స్వయంగా మాస్కులు కట్టి కరోనా వైరస్పై అవ గాహన కల్పించారు. పోలీసులకు ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు, పండ్లు అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ, రాజోలు సీఐ, ఎస్ఐలు ఎస్.శంకర్, ఎం.నాగరాజు ఉన్నారు.