ఘాట్రోడ్డుపై రాకపోకలకు అనుమతి
ABN , First Publish Date - 2022-06-29T07:06:19+05:30 IST
కొండగట్టు ఘాట్రోడ్డుపై వాహనాల రాకపోకల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భారీ వాహనాలు మినహా చిన్న వాహనాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
మల్యాల, జూన్ 28: కొండగట్టు ఘాట్రోడ్డుపై వాహనాల రాకపోకల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భారీ వాహనాలు మినహా చిన్న వాహనాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానికులు, చిరువ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. కొండగట్టు ఘాట్రోడ్డుపై రాకపోకల కోసం ఇటీవల స్థానికుల నుంచి ఒత్తిడి పెరుగడంతో ప్రభుత్వం సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది. వాహనాల రాకపోకలకు కొన్ని నియమాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు, రవాణ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలంటూ ఈ మేరకు ప్రభు త్వ కార్యదర్శి శ్రీనివాసరాజు పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి. వాహనాల రాకపోకలను గతంలో మాదిరిగా కొనసాగించాలని జడ్పీటీసీ రామ్మోహ న్రావు, స్థానిక సర్పంచ్ తిరుపతిరెడ్డి, మల్యాల సర్పంచ్ సుదర్శన్ వాహ నాల రాకపోకలకు కృషిచేయగా ఎట్టకేలకు అనుమతి లభించింది. ఇందుకు కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుంకె రవిశం కర్లకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. వాహనా ల రాకపోకలు రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.