బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ABN , First Publish Date - 2021-07-25T05:45:44+05:30 IST
సచివాలయాల సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని జీవీఎంసీ కమిషనర్ డా.సృజన సూచించారు. గ్రేటర్ 3వ వార్డు తోటవీధి, చిన్నబజారు వార్డు సచివాలయాలను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
జీవీఎంసీ కమిషనర్ సృజన
భీమునిపట్నం, జూలై 24: సచివాలయాల సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని జీవీఎంసీ కమిషనర్ డా.సృజన సూచించారు. గ్రేటర్ 3వ వార్డు తోటవీధి, చిన్నబజారు వార్డు సచివాలయాలను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి రోజూ రెండు సచివాలయములను సందర్శించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఆమె భీమిలి వచ్చారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, దరఖాస్తులను ఎప్పటికపుడు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఆప్డేట్స్ ప్రతిరోజూ సాయంత్రానికి తెలియపర్చాలని ఆదేశించారు. ఆమె వెంట జోనల్ కమిషనరు ఎస్వీ రమణ, సిబ్బంది వున్నారు.