యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2021-06-22T06:19:21+05:30 IST
యోగాతో సంపూర్ణ సంసూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యా ప్తంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
యోగాతో సంపూర్ణ సంసూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యా ప్తంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యోగా డేలో సూర్యాపేట మునిసిపల్ చైర్పర్సన్ పెరుమా ళ్ళ అన్నపూర్ణ పాల్గొని మాట్లాడారు. ఒత్తిడి తగ్గించడంలో, శారీరక బలా న్ని పెంపొందించడంతో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి, రాచర్ల కమలాకర్, నాగేశఽ్వర్రావు, శ్యాంప్రసాద్, కర్ణాకర్రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మయ్య, పాపిరెడ్డి, వెంకట్రెడ్డి, స్వర్ణ, స్వరూప, శ్రీదేవి పాల్గొన్నారు. నేరేడుచర్లలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో యోగా శిక్షకుడు మెట్టు వేణుగోపాల్రెడ్డి ఆసనాలు నేర్పించారు. కార్యక్రమంలో బట్టు మధు, కందిబండ శ్రీని వాసరావు, యడవెల్లి సత్యనారాయణరెడ్డి, సుంకరి క్రాంతికుమార్, కొణతం వెంకటరెడ్డి, యాశెట్టి మోహన్, నోముల మల్లేశం, నోముల క్రాంతి, కూరపాటి రవికుమార్, సాయి ఉన్నారు. కోదాడలో నిర్వహించిన కార్య క్రమంలో బీజేపీ నాయకుడు కనగాల వెంకట్రామయ్య, నకిరికంటి జగన్, వేలంగి రాజు, యశ్వంత్, సురే ష్, గణేష్, నరేష్ పాల్గొన్నారు. అర్వపల్లి మండలంలోని తిమ్మాపు రం సూర్యనారాయణస్వామి దేవాలయంలో చిన్నారి మేఘన చేసిన యోగా ఆసనాలు ఆకట్టుకున్నాయి. జాజిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, యోగాచార్య డాక్టర్ పగిళ్ళ సైదులును బీజేపీ ఆధ్వర్యంలో సన్మానించారు. మఠంపల్లి మండలం భీల్యానాయక్తండా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిం చిన యోగా కార్యక్రమంలో జడ్పీటీసీ బానోతు జగన్నాయక్, సర్పంచ్ గోవింధునాయక్, కార్యదర్శి హరికిరణ్, మాన్యనాయక్, నవీన్నాయక్ పాల్గొన్నారు. నడిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగా గురువు నర్సింహ్మారెడ్డి ఆసనాలు నేర్పించారు. కార్యక్రమంలో గురువులు భార్గవశర్మ, రాజు, దున్నా సతీష్, లతీప్, పరబ్రహ్మ చారి, మేకల నాగరాజు, ఏసుబాబు పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ జడ్పీ పాఠశాలలో మండల అధికారులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్సూర్నాయక్, ఎంపీవో సంజీవ, సర్పంచ్ గంపల దా వీద్, ఎంపీటీసీ ముత్తయ్య, ఏపీవో ఈశ్వర్, పంచాయతీ కార్యదర్శు లు హరికృష్ణ, అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, రజిత పాల్గొన్నారు.