యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T05:35:27+05:30 IST

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగా పోటీల విజేతలను సత్కరిస్తున్న ముత్యాలనాయుడు

మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు

చోడవరం, జూన్‌ 21:
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. స్థానిక ఉషోదయ కళాశాలలో సోమవారం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. బాల్యం నుంచే పిల్లలకు యోగాను అలవాటుగా మార్చితే సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని చెప్పారు. ఉషోదయ చైర్మన్‌ జి.రమణాజీ మాట్లాడుతూ, తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇప్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో బహుమతులు సాధించిన  పతంజలి యోగా శిక్షణ కేంద్రం విద్యార్థులు గొంతిన లయవర్ధన్‌, పందిరి వెన్నెలశ్రీలను ముత్యాలనాయుడు సత్కరించారు. కార్యక్రమంలో యోగా గురువు పుల్లేటి సతీశ్‌, ప్రేమ సమాజం రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:35:27+05:30 IST