పెప్సికో ఉద్యోగులకు కరోనా.. ఫ్యాక్టరీ మూసివేత
ABN , First Publish Date - 2020-06-23T02:45:57+05:30 IST
చైనా రాజధాని బీజింగ్లోని పెప్సికో కంపెనీలో కొందరు ఉద్యోగులకు కరోనా సోకింది.
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లోని పెప్సికో కంపెనీలో కొందరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో పెప్సికో ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. బీజింగ్లోని డ్యాక్సింగ్ డిస్ట్రిక్ట్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడి ఉద్యోగుల్లో కొందరికి కరోనా సోకడంతో.. మిగతా ఉద్యోగులందరినీ హోంక్వారంటైన్లో ఉండాలని కంపెనీ సూచించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు కరోనా అని తేలిన తర్వాత ఉత్పత్తి చేసిన ఆహారపదార్థాలను సీల్ చేసినట్లు పెప్సికో ప్రకటించింది.