కొనుగోళ్ల వద్ద రద్దీ వాతావరణం
ABN , First Publish Date - 2020-03-28T10:45:10+05:30 IST
కరోనా మ హమ్మారిని తరిమికొట్టేందుకు నివారణ చర్యలో భా గంగా లాక్డౌన్ ప్రకటిస్తే ప్రజల్లో మార్పు
నిత్యావసరాల కోసం రోడ్డెక్కుతున్న జనం
ఫోన్ చేస్తే ఇంటికే సరుకులు..
ఒంగోలు (కార్పొరేషన్) మార్చి 27 : కరోనా మ హమ్మారిని తరిమికొట్టేందుకు నివారణ చర్యలో భా గంగా లాక్డౌన్ ప్రకటిస్తే ప్రజల్లో మార్పు కని పించడం లేదు. నిత్యవసరాల పేరుతో ఏదో ఒక వి ధంగా జనం రోడ్డెక్కుతున్నారు. సామాజిక దూరం పాటించాలని పదేపదే హెచ్చరిస్తున్నా ఆచరణలో అ లసత్వం చూపుతున్నారు. కూరగాయలు, పాలు, ని త్యావసర సరుకులు కొనుగోలు పేరుతో ఒకరినొకరు తడుగుతున్నారు. దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెం దే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.
ఎవరికి వారే నిర్బంధంగా స్వీయ నియం త్రణ విధించుకోవాలని సూచిస్తున్నప్పటికీ అనవస రంగా రోడ్డపైకి వచ్చి సమూహంగా ఉంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఉ దయం 6గంటల నుంచి 1 గంట వరకు నిత్యావస రాల దుకాణాలు తెరిచి ఉండటంతో ఉదయం 9 గం టల వరకు ఏదో ఒక కారణంగా జనం వీధుల్లో క నిపిస్తున్నారు. అయితే పోలీసులు హెచ్చరికలు, బం దోబస్తులు నిర్వహించి నెత్తినోరు బాదుకుంటున్నా పలు చోట్ల ప్రజలు లెక్కచేయని పరిస్థితులు కన్పిస్తు న్నాయి. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
ఫోన్ చేస్తే ఇంటికే సరుకుల సరఫరా
నగరంలో నిత్యవసరాల కోసం జనం బారులు తీరి ఉండటంతో కార్పొరేషన్ ఆద్వర్యంలో ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టారు. ఫోన్ చేస్తే ఇంటికే స రుకులు వచ్చే విధంగా సౌకర్యం కల్పించారు. నగ రంలోని నగరంలోని కౌటిల్య సూపర్ మార్కెట్ నా లుగు బ్రాంచీలలో, మోర్కు సంబంధించిన మూడు బ్రాంచిలలో, 60 అడుగుల రోడ్లోని వెంకటేశ్వర జనరల్ స్టోర్స్లో ఫోన్ చేస్తే నిత్యవసర సరుకులు ఇంటికే చేరే విధంగా ఏర్పాటు చేశారు.
అందుకు స ంబంధించి కౌటిల్య సూపర్ మార్కెట్ సెల్ : 8142633372, మోర్ : 9705908969, వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ 9963289957లకు ఫోన్చేస్తే కావా ల్సిన వస్తువులు ఇంటికి చేరే విధంగా చర్యలు చేప ట్టామని తెలిపారు. అదేవిధంగా ఏవైనా సమస్యలు ఎదురైనపుడు కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెం.1800 425 2858 కాల్ చేయాలని క మిషనర్ తెలిపారు.