టీఆర్‌ఎస్‌ పాలనపై విసిగిపోయిన ప్రజలు

ABN , First Publish Date - 2022-06-25T06:49:35+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనతో జనం విసిగిపోయారని, వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ అన్నా రు.

టీఆర్‌ఎస్‌ పాలనపై విసిగిపోయిన ప్రజలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బాలునాయక్‌

పెద్దఅడిశర్లప ల్లి, జూన 24: టీఆర్‌ఎస్‌ పాలనతో జనం విసిగిపోయారని, వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ అన్నా రు. శుక్రవారం మండలంలోని గుడిపల్లి గ్రా మ పంచాయతీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని దాదాపు 100మంది ఇతర పార్టీల కార్యకర్తలు కార్యకర్తలు జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ అలుగుబెల్లి శోభారాణి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్‌ఖాన, డీసీసీ కార్యదర్శి కుక్కల గోవర్ధనరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన నర్సింహారెడ్డి, డాక్టర్‌ వేణుధర్‌రెడ్డి, ఎల్లయ్య, సతీ్‌షరెడ్డి పాల్గొన్నారు.     


Updated Date - 2022-06-25T06:49:35+05:30 IST