ఏడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-22T19:26:06+05:30 IST
ఏడేళ్లుగా ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో
కరీంనగర్: ఏడేళ్లుగా ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టినట్టున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానం అన్న.. కేసీఆర్కు ఓటు అడిగే హక్కు లేదని కిషన్రెడ్డి హెచ్చరించారు.