ఏడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-22T19:26:06+05:30 IST

ఏడేళ్లుగా ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో

ఏడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌: కిషన్‌రెడ్డి

కరీంనగర్‌: ఏడేళ్లుగా ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టినట్టున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానం అన్న.. కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-10-22T19:26:06+05:30 IST