ఇంటికి పంపించేశారు: PK పై Lalu సెటైర్లు

ABN , First Publish Date - 2022-05-05T20:34:12+05:30 IST

కాంగ్రెస్‌తో చర్చలు విఫలమైన అనంతరం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ కొన్ని సూచనలు చేశారు. ఇదే విషయమై గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఇందులో రాజకీయ పార్టీ గురించి కానీ, ఎన్నికల్లో పోటీ గురించి కానీ..

ఇంటికి పంపించేశారు: PK పై Lalu సెటైర్లు

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor రాజకీయాల్లోకి వస్తుండడంపై RJD అధినేత Lalu Prasad Yadav వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశం అంతా తిరిగి చివరికి బిహార్‌కే వస్తున్నారని, పీకేను దేశ ప్రజలు ఇంటికి పంపించారంటూ లాలూ ఎద్దేవా చేశారు. అయితే బిహార్‌లో సైతం పీకేకు అవకాశం లేదని, అక్కడి ప్రజలు ఆయనను నమ్మబోరని లాలూ అన్నారు. రాజకీయ ప్రవేశంపై గురువారం ప్రెస్‌మీట్‌లో పీకే మాట్లాడిన కొద్ది సమయానికే లాలూ పై విధంగా స్పందించారు.


కాంగ్రెస్‌తో చర్చలు విఫలమైన అనంతరం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ కొన్ని సూచనలు చేశారు. ఇదే విషయమై గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఇందులో రాజకీయ పార్టీ గురించి కానీ, ఎన్నికల్లో పోటీ గురించి కానీ పీకే ప్రస్తావించకుండా బిహార్ బాగు కోసం ఆలోచించే వారిని ఏకం చేస్తానంటూ చెప్పారు. తనకెవరికీ రాజకీయ విబేధాలు లేవంటూనే రాజకీయంగా ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని పీకే తేల్చి చెప్పారు.

Read more