జగన్ను గద్దె దించేందుకు సిద్ధంగా జనం
ABN , First Publish Date - 2022-05-23T05:03:09+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గద్దెదిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ గూటూరు మురళీకన్నబాబు అన్నారు.
ఏ ఎస్ పేట మే22 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గద్దెదిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ గూటూరు మురళీకన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసరావుతో కలిసి ఏఎస్ పేటలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బస్టాండు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం గ్యాస్ సిలిండర్లను బైక్పై ఉంచి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్బు రమేష్నాయుడు, ఖాదర్ బాషా, డాక్టర్ ఖాజామియా, కృష్ణారెడ్డి, శ్రీహరినాయుడు, దేవర హజరత్తయ్య, పలుగ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొడవలూరు : సీఎం జగనన్న బాదుడుతో రాష్ట్రంలోని పేదలు కుదేలవుతున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి చెక్కా మదన్ అన్నారు. మండలంలో కొత్తవంగల్లు గ్రామంలో ఆదివారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గ్రామ ప్రజలకు జగనన్న బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర , పెట్రోల్, డీజిల్ ధరలతో పేదలు అల్లాడిపోతున్నారన్నారు. నియోజక వర్గం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నేడు పంట వేసుకోవాలంటే రైతులు కంటతడి పెట్టుకునే పరిస్థితి నెలకొన్నదన్నారు. నియోజక వర్గం ధాన్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుమన్, కార్యకర్తలు పాల్గొన్నారు.