పులివెందుల ప్రజలు నివ్వెరపోతున్నారు: బీటెక్ రవి
ABN , First Publish Date - 2022-01-06T22:14:47+05:30 IST
మాజీమంత్రి వివేకా కుటుంబానికి జరుగుతున్న ద్రోహంపై పులివెందుల ప్రజలు నివ్వెరపోతున్నారని టీడీపీ నేత బీటెక్ రవి చెప్పారు.
కడప: మాజీమంత్రి వివేకా కుటుంబానికి జరుగుతున్న ద్రోహంపై పులివెందుల ప్రజలు నివ్వెరపోతున్నారని టీడీపీ నేత బీటెక్ రవి చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిలు నార్కో అనాలసిస్ టెస్ట్కు అంగీకరించాలన్నారు. నార్కో అనాలసిస్కు అంగీకరించకుంటే.. హత్యతో సంబంధం ఉందని అనుమానించాల్సి వస్తుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో జగన్, అవినాష్రెడ్డి, శంకర్రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. నిందితుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారంటే.. హత్యలో జగన్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వస్తున్నాయని బీటెక్ రవి అన్నారు.