కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి
ABN , First Publish Date - 2020-04-09T10:56:44+05:30 IST
కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అన్నారు.
మెదక్ ఆర్డీవో సాయిరాం
పెద్దశంకరంపేట/అల్లాదుర్గం ఏప్రిల్ 8 : కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మెదక్ ఆర్డీవో సాయిరాం అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుల వద్ద ఆయన కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ మనోహర్, అల్లాదుర్గం తహసీల్దార్ సాయాగౌడ్, చక్రవర్తి, ఎంపీడీవో బన్సీలాల్, ఆర్ఐ ప్రభాకర్, వీఆర్వోలు రమేశ్, శ్రీనివాస్, పోమ్యా పాల్గొన్నారు.