జనం నోట జనగణమన..

ABN , First Publish Date - 2022-08-17T05:46:23+05:30 IST

జనం నోట జనగణమన..

జనం నోట జనగణమన..
వికారాబాద్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న మంత్రి, ఐజీ, ఎమ్మెల్యే

వికారాబాద్‌, ఆగస్టు16: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా  మంగళవారం సామూహిక జాతీయ గీతలాపనకు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో విశేష స్పందన వచ్చింది. వికారాబాద్‌ ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో జాతీయ గీతాలాపనలో భారీ సంఖ్యలో విద్యార్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఐజీ కమల్‌హాసన్‌, ఎమ్మెల్యే ఆనంద్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  మురళీకృష్ణ,  శుభప్రద్‌ పటేల్‌, ఎస్పీ కోటిరెడ్డి, డీఈవో రేణుకాదేవి పాల్గొన్నారు. విద్యా ర్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈనెల 22వరకు సాగే వజ్రోత్సవాల్లోఅందరూ పాల్గొని జాతీయ స్ఫూర్తిని, ఐక్యతను చాటాలన్నారు. ఇదిలా ఉంటే జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని శివారెడ్డిపేట ఉన్నతపాఠశాలకు వెళ్లి జాతీయ  గీతలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.



Updated Date - 2022-08-17T05:46:23+05:30 IST