నగర ఆహారంలో కొవ్వు!
ABN , First Publish Date - 2020-02-22T07:58:31+05:30 IST
మెట్రో నగరాల్లో ప్రజలు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: మెట్రో నగరాల్లో ప్రజలు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఐసీఎంఆర్) నిర్వహించిన సంయుక్త సర్వేలో ఇది వెల్లడైంది. రోజూ తినే ఆహారంలో 20 గ్రాముల కొవ్వే ఉండాలి. అయితే ఈ నగరాల్లో సగటున 32.6 గ్రాముల కొవ్వు పదార్థాలను తింటున్నారని గుర్తించారు. 25.1 గ్రాముల కొవ్వుతో హైదరాబాద్ నగరం ఐదో స్థానంలో నిలిచింది.