ప్రజా నాయకుడు నాంచారయ్య మృతి

ABN , First Publish Date - 2021-01-14T12:55:30+05:30 IST

పేద ప్రజల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన..

ప్రజా నాయకుడు నాంచారయ్య మృతి

వత్సవాయి(కృష్ణా): పేద ప్రజల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన సీపీఎం నాయకుడు గంటా నాంచారయ్య (75) మక్కపేటలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత తొలి మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడిగా పని చేశారు. అణగారిన ప్రజల కోసం ఉద్యమాలు చేసి జైలు జీవితం కూడా గడిపారు. నియోజకవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడిగా, సీపీఎం కార్యదర్శిగా పని చేశారు. ఆర్‌ఎంపీ, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, జగ్గయ్యపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, ఇంటూరి రాజగోపాల్‌, సీపీఎం జిల్లా నాయకులు డీవీ కృష్ణ, చిరుమామిళ్ల హనుమంతరావు, సోమోజు నాగమణి, నెల్లూరి మాధవరావు, ఎస్సీ సెల్‌ నాయకుడు వేల్పుల రవికుమార్‌, బీజేపీ రనాయకుడు మన్నె శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు బ్రహ్మం, జిల్లా గ్రామీణ వైద్యుల సంఘ అధ్యక్షుడు భూపాలరావు నివాళులర్పించారు. 


Updated Date - 2021-01-14T12:55:30+05:30 IST