ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-08-11T06:04:52+05:30 IST
ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు.
గజ్వేల్ రూరల్, ఆగస్టు 10: ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాతర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.